మన్యం మనుగడ కరకగూడెం: మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ
టీపీసీసీ,డీసీసీ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ నెల 6 వ తేదీన వరంగల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగనున్న రైతు సంఘర్షణ సభకు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో మండలంలో ఉన్న ప్రతి ఒక్క బూతు నుంచి 20 మంది హాజరుకావాలని అదేవిధంగా మండల నాయకులు,కార్యకర్తలు యువజన నాయకులు, మహిళలు,ఎన్ఎస్ యు నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు,రైతులు తదితరులు అందరూ కలిసి పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగబండి వెంకటేశ్వర్లు,మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: