మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం లోని కత్తి గూడెం గ్రామంలో జరిగిన రైతుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తుమ్మల వెంకటరెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ కత్తి గూడెం రెవెన్యూ శివారులో గత నలభై సంవత్సరాలుగా సర్వేనెంబర్ నూట ఇరవై ఎనిమిది 128/1-4వరకు 100 మంది పేదలు సాగు చేస్తున్నారు .ఈ సర్వే నంబర్ లో పట్టాదారు కాలంలో ఉన్న సుభాష్ చంద్రబోస్ కోయ, కోయ భాస్కర్ రావు పట్టాలు రద్దు చేసి సాగు చేస్తున్నా పేదలకు పట్టాలు ఇవ్వాలని సబ్ కలెక్టర్ గౌతమ్ 2017 లో తీర్పునిచ్చిన ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈరోజుకు ఆ భూముల సర్వే చేయలేదు ఎవరికి పట్టాలు ఇవ్వలేదు ప్రభుత్వం పేదలకు సాగుచేస్తున్న భూములకు వెంటనే పట్టాలివ్వాలని గతంలో అనేక సార్లు అధికారులకు చెప్పుకున్నా ఫలితం లేదు కావున మే 25 నుండి సమస్య పరిష్కరించే వరకు పేదలకు పట్టాలు వచ్చేవరకూ మంగపేట రెవెన్యూ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపడతామని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే పేదలకు సాగుచేస్తున్న భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లో గిరిజన సంఘం నాయకులు కర్సం చిరంజీవి, తోకల రవి, వాసవి ఎర్రయ్య, రాములు, కిషోర్, కొండయ్య, వెంకటాద్రి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: