CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పి డి యస్ యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గా కె. సంద్య, కాంపాటి పృధ్వీ ఎన్నిక.

Share it:


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పి డి యస్ యూ) బద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గా కె. సంద్య(పాల్వంచ), కాంపాటి పృధ్వీ(ఇల్లందు) లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పి డి యస్ యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్ నాగేశ్వరరావు, బోయినపల్లి రాము ప్రకటించారు. 


పి డి యస్ యూ బద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిర్మాణ జనరల్ బాడీ సమావేశం 17-3-2022 జంపాల ప్రసాద్ నగర్ (ఇల్లందు) లో జరిగింది. 

ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న కె. సంధ్య కాంపాటి పృథ్వీ లను జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గా ఎన్నుకున్నారు.వీరు తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక సామాజిక,ప్రగతిశీల ఉద్యమాలలో భాగస్వామ్యం అయ్యారు.ఈ క్రమంలో అనేక కేసులు నిర్బంధాలు ఎదుర్కొని విద్యార్థులకు అండగా ఉంటూ ముందుకు సాగుతున్నారు.

ఈ సందర్భంగానూతనంగా ఎన్నిక అయిన కె. సంద్య, కాంపాటి పృధ్వీ మాట్లాడుతూ సామాజిక సంబంధాలు వ్యాపార మయం కాకూడదు అంటే ప్రభుత్వ విద్య అవసరము కానీ పాలకులు విద్యను వ్యాపార మయం చేయడం మూలంగా విద్యా లక్ష్యాలు నెరవేరకపోవడమే కాకుండా వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయని వారు అన్నారు. విద్యా సమాజ ప్రగతికి తోడ్పడే అతి ముఖ్యమైన సాధనంగా భావించి ప్రభుత్వ విద్యా బలోపేతానికి ప్రభుత్వాలు కృషి చేయాలని వారు అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేందుకు జరిగే ప్రగతిశీల ఉద్యమాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

వీరితో పాటు ఉపాధ్యక్షులు గా యనగంటి వంశీవర్థన్(ఇల్లందు),రాజ్ కుమార్ (పాల్వంచ) సహయ కార్యదర్శులు గా బానోత్ నరేందర్ (ఇల్లందు), జబ్బా సురేష్ (గుండాల),కోశాధికారి ఎ. పార్థసారథి తో పాటు మరో పది మంది కమిటి సభ్యులు గా ఎన్నికయ్యారు.

Share it:

TS

Post A Comment: