CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది.

Share it:


మన్యం మనుగడ, అశ్వరావుపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణం ఎంపీడీవో కార్యాలయం నందు జగిత్యాల జిల్లా, బీరా పూర్ మండలం, తుంగారం గ్రామంలో విధి నిర్వహణలో ఉన్న అధికారులుపై జరిగిన పెట్రోల్ దాడిలో ఎంపీఓ గాయపడిన విషయంపై నిరసన వ్యక్తం చేస్తూ అశ్వరావుపేట ఎంపీడీవో విద్యాధరరావు, ఎంపీఓ సీతారామరాజు ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం భోజన సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కార్యాలయ ఆవరణంలో ఉన్న గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన తెలుపుతూ ఇటువంటి దాడులు జరగడం వలన ఆత్మస్థైర్యం కోల్పోతారని ఖండించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, టైపిస్ట్, ఈజీఎస్ కార్యాలయ సిబ్బంది మరియు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: