మన్యం మనుగడ కరకగూడెం : ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని ఎంపీపీ రేగా కాళిక అన్నారు.సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్పంచులు కార్యదర్శులు ఎంపీడీవో ఎంపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 3 తారీకు నుండి 18 తారీకు వరకు జరిగే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు ప్రతి పంచాయతీలో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా గ్రామాల అభివృద్ధి చేయాలని వారన్నారు. పంచాయతీ లో ఉన్న పకృతి వనాలు డంపింగ్ యాడ్,స్మశాన వాటికలు వంటి పనులను పూర్తి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీను, ఎంపీఓ చిరంజీవి,అన్ని పంచాయతీల్లో సర్పంచులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: