మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట ఎస్ఐ ఎస్కే.తాహెర్ బాబాను రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ లు ఆదివారం ఘనంగా సన్మానించారు. మండలంలోని నర్సింహ సాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శనిగకుంట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇండ్లు కాలిపోయిన బాధిత కుటుంబాలను ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం పరామర్శించారు. శనిగకుంట గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించినప్పటి నుండి నేటి వరకు మంగపేట ఎస్సై ఎస్కే.తాహెర్ బాబా పోలీస్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, స్థానికుల సహకారంతో చేపట్టిన సహాయక చర్యలు, బాధిత కుటుంబాలకు ఇస్తున్న మనోధైర్యం గురించి బాధిత కుటుంబాలు, శనిగకుంట గ్రామస్థులు, అధికారులు, పలు పార్టీల నాయకులు మంత్రి సత్యవతి రాథోడ్ కు వివరిస్తూ ఎస్సై తాహెర్ బాబా కు ధన్యవాదాలు తెలిపారు. దాంతో పాటు అగ్ని ప్రమాదం సంభవించిన సమాచారం తెలుసుకుని సకాలంలో స్పందించి సంఘటనా స్థలంకు చేరుకుని అగ్ని ప్రమాదం మరింత వ్యాపించకుండా తమ పోలీస్ సిబ్బంది, స్థానికుల సహకారంతో ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు అగ్ని ప్రమాదం జరిగిన సమయం నుండి ఇప్పటి వరకు రేయింబవళ్ళు అనే తేడా లేకుండా అటు బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తూ ఇటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వీఐపీలు పర్యటన సమయంలో సమర్ధవంతంగా బందోబస్తు విధులు నిర్వహిస్తూ బాధితుల, గ్రామస్థుల, మండల ప్రజల, ఉన్నతాధికారుల, ప్రజా ప్రతినిధుల మన్ననలు, అభినందనలు పొందిన సంగతి తెలుసుకున్న రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తదితరులు ఎస్సై తాహెర్ బాబాకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి , భూపాలపల్లి , ములుగు జిల్లాల ఓఎస్డీ శోభన్ కుమార్, ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్ కుమార్, ఏటూరునాగారం సీఐ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: