CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏండ్ల నాటి కల నెరవేర్చిన రేగా :- కోట్ల రూపాయల నిధులతో గుండాల మండల అభివృద్ధి :- ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ప్రభుత్వ విప్ రేగా

Share it:

 


గుండాల మే 16(మన్యం మనుగడ) ప్రజల పక్షాన నిలుస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. సోమవారం గుండాల మండలం లో పర్యటించిన ఆయన లింగగూడెం వద్ద మల్లన్న వాగుపై 6 కోట్ల 45 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన వంతెన ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మల్లన్న వాగుపై నిర్మాణం కావడంతో ఏండ్ల నాటి ప్రజల కల నెరవేరింది అన్నారు. కోట్ల రూపాయల నిధులతో గుండాల మండలాన్ని అభివృద్ధిలో నిలుపుతున్న మన్నారు. అంతర్గత రహదారుల కోసం పెద్దఎత్తున నిధులు మంజూరు చేయించి నిర్మాణం పూర్తి చేస్తున్నామన్నారు. ఇద్దరు మంత్రులు గుండాల పర్యటనలో ఇచ్చిన హామీ లో భాగంగా 15సిసి రోడ్లను సైతం పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులను తెచ్చి మిగిలి ఉన్న పనులను సైతం పూర్తి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి రామక్క, ఎంపీపీ ముక్తి సత్యం, తాసిల్దార్ కిషోర్ , ఎం పీ డీ వో హజరత్ వలి, లింగ గూడెం సర్పంచ్ నరసింహారావు,టిఆర్ఎస్ నాయకులు భవాని శంకర్, వట్టం రాంబాబు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భాస్కర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య, గడ్డం రమేష్ , నిట్ట రాములు, అబ్దుల్ నబి, అధికారులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: