దమ్మపేట మే 27 ( మన్యం మనుగడ ) : మందలపల్లి గ్రామ ఉపసర్పంచ్ ఫీడ్ ద నీడ్ సంస్థ చైర్మన్ గారపాటి సూర్యనారాయణ అనురాధ దంపతులు ఇటీవలే ప్రమాదవశాత్తు మరణించిన మందలపల్లి కి చెందిన రమేష్ యొక్కఇద్దరు కుమార్తెలు అక్షిత,చైత్రశ్రీ లకు గతంలోనే 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన విషయం పాఠకులకు విదితమే ఆ డబ్బును పిల్లల పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. గారపాటి దంపతులు ద్వారా పిల్లల పరిస్థితి తెలుసుకున్న అమెరికాలో ఉంటున్న వారి స్నేహితులు దావులూరి నరసింహారావు, పూర్ణిమ దంపతులు ముందుకు వచ్చి పిల్లల సంరక్షణార్థం ప్రతినెల పిల్లలకు 3000 పంపుతానని నేడు మొదటి విడతగా గారపాటి దంపతుల ద్వారా పోస్ట్ ఆఫీస్ లో జమ చేయడం జరిగింది. ఇక నుంచి ప్రతి నెల పిల్లలకు ఆ మొత్తం పోస్ట్ ఆఫీస్ లో జమ చేయడం జరుగుతుంది అని తెలియజేశారు. ఇంతటి సేవా కార్యక్రమాలు చేపడుతున్న గారపాటి దంపతులకు పలువురు అభినందనలు తెలియపరిచారు .ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మద్దెల పుల్లారావు, కార్యదర్శి నందికోల రామారావు, చింతలచెరువు భాగ్యరాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: