మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ:చెక్ గేట్ల తో అడుగులకు పూర్తిస్థాయి రక్షణ కలుగుతుందని అటవీశాఖ రేంజర్ చలమల శ్రీనివాసరావు స్పష్టం చేశారు.శుక్రవారం బెండాలపాడు అటవీ ప్రాంతం వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్ గేట్ ను మండల స్థాయి అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.అనంతరం ఏర్పాటుచేసిన అడవులపై సంరక్షణ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చెక్ గేట్లు సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు మూసివేయడం జరుగుతుందన్నారు.అటవీ భూముల్లో చెట్లను నరుకుట చట్టరీత్యా నేరము, అదేవిధంగా జంతువులను వేటాడిన కేసులు నమోదు చేస్తామన్నారు.అటవీ భూముల్లో ఎలాంటి నేరం జరిగిన శాటిలైట్ ద్వారా గుర్తించి, నేరస్తుల పై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు.ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూముల లో సైతం చెట్లు నరికిన, ప్రభుత్వ భూముల్లో అనుమతిలేకుండా చెట్లు నరికిన కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సీఐ వసంత కుమార్, ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి,ఎంపీడీవో అన్నపూర్ణ, మండల ప్రత్యేక అధికారి సంజీవరావు, డిప్యూటీ తహసిల్దార్ ప్రసన్న, మండల పంచాయతీ అధికారి తోట తులసీరామ్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: