మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:అశ్వాపురం మండల కేంద్రంలో శ్రీ కోదండ రామాలయంలో గ్రామ పెద్దల సమక్షంలో వివాహం జరిపారు.వివరాల్లోకి వెళితే మండలానికి చెందిన సుమిత్రా మరియు సంపత్ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు.ఇరువురి ఇండ్లల్లో వారి తల్లిదండ్రులు ప్రేమ వివాహాన్ని ఒప్పుకోకపోవడంతో అమ్మాయి,అబ్బాయి గ్రామ పెద్దలను సంప్రదించగా వారు సంప్రదాయ పద్దతిలో వివాహం జరిపించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్తినేని సుజాత, వేములపల్లి రమేష్ ,ఉప సర్పంచ్ భూక్యా చందు నాయక్, టిఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ,కేశవరెడ్డి, సతీష్ బాబు,వెంకటేశ్వర్లు,రఘు,వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: