మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: అక్రమ మట్టి తవ్వకాలపై పోలీసులు దాడి చేసి రెండు జెసిబి లు, ఆరు ట్రాక్టర్లు పట్టుకున్న సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ ఐ గొల్లపల్లి విజయలక్ష్మి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పోకలగూడెం, గానుగపాడు గ్రామాల మధ్య లో శనివారం అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో మట్టి ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపట్టిన జెసిబి,ట్రాక్టర్ లను పట్టుకోగా, ఆదివారం ఉదయం రేపల్లెవాడ గ్రామ శివారులో గల వెదుళ్ల వాగు పక్కన మట్టి తవ్వకాలు చేస్తున్న జెసిబి తో పాటు, ఐదు ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి మొత్తంగా రెండు జెసిబి లు, ఆరు ట్రాక్టర్లు సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేపట్టిన,ఇసుక అక్రమ రవాణా చేసిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ రంగారావు, కానిస్టేబుల్ శివ, హోంగార్డు లాజరస్ పాల్గొన్నారు.
Post A Comment: