మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గూడెం గ్రామంలో కారం రాజుకు చెందిన పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో పోయి ద్వారా మంటలు ఇంటిని అంటుకుని ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ప్రాణ నష్టం ఏమీ జరగలేదు.లక్షా 50 వేల విలువైన నష్టం జరిగినట్లు బాధితులు తెలియజేశారు. వేరే ఇళ్లకు నిప్పు అంటుకోకుండా గ్రామ ప్రజలు అప్రమత్తమై మంటలను ఆర్పి వేశారు. అదేవిధంగా ఇదే గ్రామంలో పొలాల్లో ఎరగడి పడి గ్రామ సమీపంలోని జామాయిల్ తోట దగ్ధం అయింది. గత కొన్ని రోజుల నుండి పినపాక గోపాల రావు పేట గూడెం గ్రామాలకు చెందిన పంట పొలాల్లో రైతులు ఎరగడి పెడుతూనే ఉన్నారు. ఈ కారణంగా కొన్ని రోజుల నుండి ఈ గ్రామాలకు చెందిన రైతులు భయంతోనే బతుకుతూ ఉన్నారు. గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక యంత్రం జామాయిల్ తోట ప్రాంతానికి వచ్చి మంటలను ఆర్పి వేయడం జరిగింది. ఎంపీటీసీ చింతపంటి సత్యం సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి, అగ్నిమాపక సిబ్బందితోపాటు సహాయక చర్యలను అందించారు.
Post A Comment: