గుండాల మే 10(మన్యం మనుగడ) దొంగ తోగు గ్రామ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు గ్రామ ప్రజలు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంగళవారం దొంగతోగు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం గ్రామ ప్రజలు మాట్లాడుతూ ముత్త పురం నుండి దొంగతోగు వరకు 14 కోట్ల 38 లక్షల తో రోడ్డు నిర్మాణం కోసం నిధులు కేటాయించినందుకు ఆయనకు ధన్యవాదాలు అని అన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వ విప్ కాంతారావుకు ఆజన్మాంతం రుణపడి ఉంటామని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమరం బాయమ్మ , ఉప సర్పంచ్ బచ్చల పాపారావు, గ్రామస్తులు పాల్గొన్నారు
Post A Comment: