జూనియర్ కళాశాల సెంటర్లోని శ్రీ సాయినాధుని మందిరంలో గురువారం నాడు ఉదయం బాబా వారికి అభిషేకం అర్చన జరిపారు. స్వర్ణ కిరీటం ధరింప చేసి హారతి పాడారు.
సాయి బాబా వారికి మామిడి పళ్ళ తో అష్టోత్తర నామార్చన జరిపారు. పూజ అనంతరం మామిడి పళ్ళు భక్తులందరికీ పంచి పెట్టారు.ఈ పూజ కార్యక్రమంలో ఆలయ ఉపాధ్యక్షులు కొమ్మనాపల్లి ఆదినారాయణ, కోశాధికారి కుంచాల రమేష్ ఆలయ సభ్యులు గొర్ల వెంకటేశ్వరరావు భక్తులు పాల్గొన్నారని అధ్యక్షులు తుమ్మలపల్లి సత్యనారాయణమూర్తి తెలిపారు.
భక్తులు అందించిన విరాళాలతో గురువారం మధ్యాహ్నం ఆరు వందల మంది భక్తులు బాబా వారి అన్నప్రసాదం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: