మన్యం టివి దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి సోదరులు రాంప్రసాద్, రవికుమార్ మాతృమూర్తి రావులపల్లి సుశీల 83 అనారోగ్యంతో స్వగ్రామమైన నర్సాపురం గ్రామంలో నిన్న తుది శ్వాస విడిచారు. భర్త రావులపల్లి నాగభూషణం అడుగుజాడలలో నడుస్తూ సిపిఐ పార్టీ భద్రాచలం నియోజవర్గంలో చురుకైన పాత్ర పోషించారు అదే విధంగా సిపిఐ పార్టీకి కార్యకర్తలకు ఇంటికి వెళ్ళినా వాళ్లను ఆప్యాయంగా పలకరించి భోజనం వసతి ఏర్పాటు చేసేవారు. నరసాపురం సర్పంచ్ గా కూడా పనిచేశారు, ఈరోజు లేరనే వార్త భద్రాచలం నిహాజకవర్గ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది .ఈరోజు జరుగు అంత్యక్రియలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సిపిఐ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ తలసాని రఘురాం,మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ,మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, బిజెపి జిల్లా అధ్యక్షులు కోనేరు చిన్ని ,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి భాగం హేమంతరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, టిఆర్ఎస్ నాయకులు భద్రాచలం డివిజన్ ఇంచార్జి వెంకట్రావు, సిపిఎం నాయకులు బాల రెడ్డి, గడ్డం స్వామి, శరత్ ,ఎలమంచిలి రవి కుమార్ ,శ్రీనుబాబు, వెంకట్ రెడ్డి ,కాంగ్రెస్ నాయకులు రవికుమార్ ,భద్రాచలం,చర్ల మండల అఖిలపక్ష రాజకీయ పార్టీ నాయకులు నివాళులర్పించారు
Post A Comment: