గుండాల మే 26(మన్యం మనుగడ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఐసిడిఎస్ కేంద్రాలను నిర్వహిస్తుంటే సిబ్బంది నిర్లక్ష వైఖరితో కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం అభాసుపాలు కావాల్సి వస్తుంది. ఐసిడిఎస్ కేంద్రాలకు సరఫరా అవుతున్న పాలు ,గుడ్లు పంపిణీకి ముందే పాడైపోయిన ఇప్పటికీ వాటిని సిబ్బంది నిర్లక్ష్యంగా చంటి పిల్లల తల్లులకు గర్భిణీలకు పంపిణీ, ఈ పాలు తాగితే ఆరోగ్యం ఏమో కాని అనారోగ్యం పాలవడం ఖాయంగా కనిపిస్తోందని బాలింతలు, గర్భిణీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన సూపర్వైజర్, సిడిపిఓ నిర్లక్ష్య వైఖరి వల్లనే పాడైపోయిన వస్తువులను సరఫరా అవుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు నాణ్యమైన పాలు గుడ్లను సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని గుండాల మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు
Navigation
Post A Comment: