మన్యం మనుగడ, పినపాక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పాలకవర్గ సభ్యులు
బొలిశెట్టి వెంకటేశ్వర్లు ప్రథమ వర్థంతి వారి స్వగృహం గోపాలరావు పేట లో జరిగింది.ఈ సంధర్బంగా వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ రవి శేఖర్ వర్మ మాట్లాడుతూ, బొలిశెట్టి వెంకటేశ్వర్లు మన సహకార సంఘంలో చురుకైన పాత్రవహించారు అని, ఆయన లేనిలోటు సంఘంలో సుస్పష్టం గా కనిపిస్తుంది అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పాలకవర్గ సభ్యులతో కలిసి శ్రద్ధాంజలి ఘటించారు .
ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు బత్తుల వెంకటరెడ్డి ,పాలకవర్గ సభ్యులు గునిగంటి సమ్మయ్య , సంఘ మానిటరింగ్ అధికారి రమేష్ , సీఈవో చింతల రాంబాబు , సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: