మన్యం మనుగడ, మంగపేట.
ములుగు జిల్లా మంగపేట మండలంలోని నర్సింహసాగర్ గ్రామ పంచాయతీ శనగకుంట గ్రామంలో గత నెల తేదీ 28 సాయంత్రం సమయంలో అగ్నిప్రమాదం సంభవించడం వలన 32 ఆదివాసీ కుటుంబాలు నిలువ నీడ కోల్పోయి నిరాశ్రయులు గా మారిన విషయం విధితమే.
ఈ ఘటనను తెలుసుకున్న కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ నిలువనీడను కోల్పోయిన ఆదివాసీ ప్రజలకు అండగా ఉండాలని తన స్వంత గంగారాం మండలంలోని ప్రజలను ఆదివాసీ సంఘాలను, తుడుందెబ్బ, ఉద్యోగులు,ప్రజలను చైతన్య పరిచి విరాళాలను సేకరించి ప్రొఫెసర్ ఈసం నారాయణ ఆధ్వర్యంలో శనగకుంట అగ్నిప్రమాద 32 ఆదివాసీ కుంటుంబలాకు ప్రతి కుటుంబానికి మహిళలకు 4 చీరలు,8 క్వింటాలు బియ్యం,1లక్ష రూపాయలు తన చేతుల మీదుగా అందించటం జరిగింది. ఈ కార్యక్రమాన్నీ ఉద్దేశించి మాట్లాడుతూ ప్రమాద వశాత్తు ప్రకృతి వైపరీత్యం వల్ల ఎటువంటి ప్రమాదం జరిగిన ప్రజలను ఆదుకోవటానికి మా గంగారాం మండలంలోని ప్రజలు ఎప్పుడు ముందు ఉంటారని తెలియజేశారు.గంగారాం మండలం ప్రజలు అందరూ భాదితులకు సహాయం గా ముందుకు రావడం సంతోషించవలసిన విషయం, గంగారాం ప్రజలకు, శనగ కుంటఅగ్ని ప్రమాద భాధితులకు చేయూతను ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సందర్బంగా ఈసం నారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు.
అగ్నిమాద భాదితులకు ప్రభుత్వం తక్షణమే ఒక జిఓ ను విడుదల చేసి డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని, రాబోయే కాలం వర్షాకాలం కాబట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రస్తుతం తాత్కాలిక నిర్మాణాలు చేయించి భాధితులకు ప్రభుత్వమే అండగా ఉండాలని
ప్రొఫెసర్ ఈసం నారాయణ కోరారు. ఈకార్యక్రమంలో ఐటీడీఏ పేసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి. బుర్క యాదగిరి, ఉద్యోగుల సంఘం మహుభూభా బాద్ జిల్లా ఉపాధ్యక్షుడు ముడిగా రామచందర్,సర్పంచ్ ల ఫోరమ్ మండల అధ్యక్షుడు ఇర్ప సూరయ్య,ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు మల్కమ్ లక్ష్మీనర్సు,తుడుందెబ్బ మండల అధ్యక్షుడు. ఈసం నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి జోగ రాహుల్,ఉద్యోగుల సంఘం నాయకులు జజ్జరీ లక్ష్మీ నర్సు,జజ్జరీ వెంకటేశ్వర్లు, సిద్దబోయిన నర్సయ్య,మొదలగు నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: