మన్యం మనుగడ కరకగూడెం: కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలకు మాతృ అభయ ఫౌండేషన్ అధ్వర్యంలో వాటర్ ప్రీజ్ హాస్పిటల్ ఇంచార్జీ వైద్యులు డాక్టర్ నరేష్ కి అందజేశారు. ఈ సందర్భంగా మాతృ అభయ పౌండేషన్ వ్యవస్థాపకుడు రామటెంకి రమేష్-దేవి దంపతులు మాట్లాడుతూ.తనవంతు సహాయంగా ప్రభుత్వ వైద్యశాలకు చిన్న వాటర్ ప్రిజ్ అందజేయడం జరిగిందని,గతంలో నా సతీమణి ఈ వైద్యశాలలో పండంటి బాబుకి జన్మనిచ్చిన హాస్పిటల్ కి ఎదైన సహాయం చెయ్యాలని వేసవి కాలం కావడంతో హాస్పటల్ కు వచ్చే పేద ప్రజలకు తాగునీరు ఇబ్బంది లేకుండా ఉండటంకోసం వాటర్ ప్రిజ్ అందజేయడం జరిగిందని ఈ ప్రిజ్ హాస్పిటల్ కి వచ్చి పోయే రోగులకు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అందించామని అన్నారు.ఈ కార్యక్రమంలో మాతృ అభయ ఫౌండేషన్ పినపాక నియోజక వర్గ నిర్వాహకులు ,చిట్టిమల్ల సతీష్ చారీ, కల్తీ లక్ష్మయ్య, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ నాయకులు కొంపెల్లి రామలింగం,చిట్టి సత్తిష్ హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: