మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలంలోని తిమ్మంపేట గ్రామంలో గోనె నరేందర్ ఇటీవలే అనారోగ్యంతో మరణించాడు,అతనికి ఇద్దరమ్మాయిలు ఉన్నారువారి కుటుంబాన్ని కలిసి,ఓదార్చి వారికి రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులు అందించారు, వారి చిన్న కూతురు వసంత ఇంటర్ చదువుతుంది ఆ అమ్మాయికి పై చదువులకు అయ్యే ఖర్చును శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ బాధ్యతను తీసుకుంటుందని వారి కుటుంబాన్ని కి తెలిపారు .అదే గ్రామంలో పెద్దబోయిన రాజు అనే వికలాంగుడు అనారోగ్యంతో బాధపడుతూ ఒంటరిగా జీవిస్తున్నారు .అతన్ని శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులు కలిసి రెండు వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. అనంతరం బుచ్చంపేట గ్రామం లో ఇటీవల పాము కాటు తో అనారోగ్యం పాలైన అక్కపల్లి.సుజాత ఆరోగ్య వివరాలు అడిగి, వారి కుటుంబానికి రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం కమలాపురం గ్రామంలో బోయి.పూర్ణమ్మ అనే నిరుపేద కుటుంబాన్ని కలిసి శ్రీ రామకృష్ణ సభ్యులు రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ ట్రస్ట్ సభ్యులు బాడిశ నాగ రమేష్, నవీన్, ఇర్ప నాగ శ్రావణ్ ,కొమరం వికాస్ హర్షవర్ధన్, చౌలం.వేణు ,మానవ సేవ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు జై భీమ్ రామ్మోహన్ ,తిమ్మంపేట గ్రామస్తులు గోమాసు సావిత్రి, బోడ ప్రవీణ్, పూస పూర్ణ, గోనె కేశవులు,బోడ ఆనంద్, బిలుపాటిరామ్ చరరణ్, గోనె రాకేష్, బాలు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: