మన్యం మనుగడ, పినపాక:
ములుగు జిల్లా మంగపేట మండలం శనగ కుంట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 40 ఇళ్ళు దగ్దం అయ్యాయి. ఈ అగ్నిప్రమాదంలో 40 కుటుంబాలు నిలువ నీడ లేక రోడ్డున పడ్డాయి. వారి పరిస్థితి దయనీయంగా మారడంతో చలించి పోయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి గ్రామానికి చెందిన ప్రజలు స్వచ్ఛదంగా తమ వంతు సాయం అందించారు. అగ్నిప్రమాద బాధితులకు నిత్యావసరాలు, బియ్యం, నగదు అందించడం జరిగింది.
Post A Comment: