మన్యం మనుగడ ఏటూరు నాగారం
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ సిబ్బంది, ప్రజలు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సిజిఎం అన్నారు.
మండల కేంద్రంలో శుక్రవారం విద్యుత్ భద్రత వారోత్సవాలను నిర్వహించారు.ఈ సందర్భంగా సిజిఎం మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో ప్రజలు, రైతులు ఏమరపాటుతో ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సమస్యలు ఉంటే తమ శాఖ అధికారులు, సిబ్బందికి సమాచారం ఇవ్వాలని. ప్రజలు రైతులు స్వతహాగా మరమ్మతులు చేయవద్దన్నారు. విద్యుత్ సిబ్బంది కాకుండా అనధికారికంగా విద్యుత్ స్తంభాలు ఎక్కడం ఫ్యుజులు వేయడం తీగలు సరిచేయడం ఎవరూ చేయవద్దని విద్యుత్ సిబ్బంది సహాయం తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సిజియం బేకం సింఘ్,యస్ఈ మల్సూర్, డిఈ మర్రిరెడ్డి,ఏటూర్ నాగారం ఏడిఈ విజయరాజు,ఎఈ తిరుపతి,కమలాపురం ఎఈ, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: