CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

హెల్మెట్ తో ప్రయాణం సురక్షితం:మణుగూరు ఎస్ ఐ పురుషోత్తం.

Share it:


మన్యం టీవీ మణుగూరు:


ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ వినియోగించాలని,హెల్మెట్ తో సురక్షితంగా గమ్యాన్ని చేరవచ్చని ఎస్ఐ పురుషోత్తం సూచించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు పట్టణంలోని పూల మార్కెట్ సెంటర్లో సోమవారం వాహనాల తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా పలు వాహనాల పత్రాలను తనిఖీలు చేశారు. పత్రాలు సరిగా లేకుండా వాహనాలు నడుపుతున్న వాహనదారులకు జరిమానా విధించారు.అనంతరం వాహనదారులకు పలు సూచనలు చేశారు.పత్రాలు లేకుండా వాహనాలను నడప వద్దని తెలిపారు.మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.అధిక వేగం ప్రమాదాలకు కారణమని, రవాణా శాఖ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. నిబంధనలు అధిగమిస్తే శాఖ పరంగా చర్యలు ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఐ పురుషోత్తం,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: