గుండాల మే 7(మన్యం మనుగడ) పీ వై ఎల్ ఆధ్వర్యంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు 98వ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు, గుండాల, కాచన పల్లి, చెట్టుపల్లి తదితర గ్రామాల్లో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించి అనంతరం పి వై ఎల్ జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ అల్లూరి స్ఫూర్తితో ఉద్యోగ అవకాశాల కోసం పోరాడాలని అన్నారు. 27 సంవత్సరాల వయసులోనే మన్యంలో ఆదివాసీలు, ఇతర పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు రంగన్న, ఈసం కృష్ణ , సారన్న , మల్లేష్ , ఉప సర్పంచ్ వాసు, ఎనుగంటి లాజర్, పి డి ఎస్ యు రాష్ట్ర నాయకులు ఇర్ప రాజేష్ , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: