మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను ఆదివాసి సంఘం నాయకులు ఆధ్వర్యంలో ఆదివారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ తెగల సాంస్కృతిక సమ్మేళనం ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా మే 16 వ తేదీ నాడు భద్రాచలం లోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు జరగనున్న ఆదివాసి సాంస్కృతిక సమ్మేళనం వాల్ పోస్టర్ ను విప్ రేగా కాంతారావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.అనంతరం విప్ రేగా ను హాజరు కావాల్సిందిగా కోరుతూ ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఆదివాసి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: