గుండాల మే 16(మన్యం మనుగడ) ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అభివృద్ధి పనులను సోమవారం పరిశీలించారు. కొడవటంచ గ్రామం నుండి ఇ నడిమి గూడెం వరకు నిర్మాణం జరుగుతున్న రహదారిని ఆయన పరిశీలించారు. సాయనపల్లి, వెంకటాపురం గ్రామాల మధ్య ఉన్న అందుగుల వర్రె పై వంతెన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనులన్నింటిని త్వరగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించి వేగవంతంగా పనులు చేసే విధంగా అధికారులు చొరవ చూపాలని ఆయన కోరారు
Post A Comment: