గుండాల మే 10(మన్యం మనుగడ) చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీ వై ఎల్ జిల్లా కార్యదర్శి పరిష్కారవి పిలుపునిచ్చారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడిచినా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడంలో నిర్లక్షం వహిస్తోందని అన్నారు. తక్షణమే 80 వేల ఉద్యోగా నోటిఫికేషన్ను విడుదల చేయాలని కోరారు. 23 వ తారీఖున తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి వై ఎల్ నాయకులు బొగ్గరపు రాజు, వజ్జ మధు, ఎనుగంటి లాజర్, ఇతరులు పాల్గొన్నారు
Post A Comment: