CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా ఈద్ మిలాప్ కార్యక్రమం:ముఖ్య అతిధిగా పాల్గొన్న బిటిపిఎస్ చీఫ్ ఇంజనీర్ పి.బాల రాజు..

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల పరిధి లోని,భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మణుగూరు పరిపాలన విభాగపు ఆవరణములో ఈద్ మిలాప్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా ముస్లిం ఉద్యోగులు నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమములో ముఖ్య అతిధి గా బిటిపిఎస్ చీఫ్ ఇంజనీర్ పి.బాల రాజు, పాల్గొని మాట్లాడుతూ,భారత దేశము కుల మతాలకు అతీతంగా మానవులు అంతా సమానమేనని,అందరు కరుణ, దయాగుణం,క్షమాగుణంతో మెలగాలని పవిత్ర ఖురాన్ గ్రంధము భోదిస్తున్నదని తెలియపరిచారు.ఈ పవిత్ర రంజాన్ మాసంలో రోజూ ఉపవాసం ఉండటం వలన ఆరోగ్యంతో పాటు,దైవభక్తి, ఇతరులపై సమాన భావం, కలుగుతుందని పేర్కొన్నారు. పవిత్ర ఖురాన్ గ్రంధము సమస్త మానవాళికి మార్గదర్శకము అని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ముస్లిం ఉద్యోగులు చీఫ్ ఇంజనీర్ పి. బాల రాజు కు 3 పత్ర ఖురాన్ గ్రంథమును బహుకరించి మరియు సన్మానించడం జరిగినది.ఈ కార్యక్రమములో అందరూ పర్యవేక్షక ఇంజనీర్స్, డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ అఫ్ అకౌంట్స్ అన్ని యూనియన్ల నాయకులు,అన్ని అసోసియేషన్ నాయకులు పాల్గొని తమ సందేశాన్ని ఇవ్వటం జరిగినది.ఈ కార్యక్రమానికి సయ్యద్ అలాఫ్ ఉన్నసా,అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్ అధ్యక్షత వహించారు.సమన్వయకర్తలుగా ఎం డి.అకర్ హుస్సేన్, సాదిక్ పాషా,ఆరిఫ్ అహ్మద్, షలా తస్సానీమ్, జాయిబున్నీసా,బేగమ్,ఫాతిమా,షంషుద్దీన్,భీమత్,సాజిద్ మరియు రాయ్ సాహెబ్ వ్యవహరించినారు.ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఉద్యోగులందరూ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: