మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, ఆశుపాక గ్రామ పంచాయతీలో ఉన్న ప్రభుత్వా పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి ఒక్కా విద్యార్ధికి కార్పొరేట్ పాఠశాలకు దీటుగా మంచి నాణ్యమైన ఆంగ్ల విద్యను అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో మనఊరు మనబడి అనే బృహోత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారని దానిలో భాగంగా ఆసుపాక గ్రామంపంచాయతీలో వున్న ప్రభుత్వా పాఠశాలకు సుమారు 18 లక్షల రూపాయలతో నూతన హంగులను దిద్దుకుంటుందని, అలాగే పాఠశాలలో జరిగే ప్రతి పని, నాణ్యతగా వుండాలని త్వరగతిన పనులనూ పూర్తీ చేయాలని సంభందిత కాంట్రాక్టర్ ఆదేశించిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి. శ్రీరామమూర్తి. ఈ కార్యక్రమంలో ఆశుపాక సర్పంచ్ కొనుసోతు లింగయ్య, ఉపసర్పంచ్ వేంకటేశ్వరావు, విద్యా కమిటి చైర్మన్, పాఠశాల ఉపాధ్యాయులు, పంచాయతి కార్యదర్శి మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: