CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు సాగు రైతులతో మాట్లాడి మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే పొదెం వీరయ్య..

Share it:

 


మన్యం టివి దుమ్ముగూడెం::

దుమ్ముగూడెం మండలం నడికుడి గ్రామపంచాయతీ పరిధిలోని నందులచలక గ్రామంలో లో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పర్యటించారు ఈ సందర్భంగా గ్రామస్తులు అందరితో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. కొంతమంది పోడు సాగు దారు రైతులు పోడు భూముల సమస్యలను ఫారెస్ట్ అధికారులు వారి సిబ్బంది గురి చేస్తున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే అక్కడినుంచి డిఎఫ్ఓ , ఎఫ్ ఆర్ వో తో మాట్లాడి గిరిజన పోడురైతుల సమస్యలపై సమాలోచన చేసేవరకు గిరిజన రైతులను ఇబ్బంది గురి చేయవద్దని ఆదేశించారు. అదేవిధంగా వరంగల్ రైతు సంఘర్షణ సభలో ప్రవేశపెట్టిన రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గిరిజనులకు పొడు భూముల పట్టాలు ఇస్తామని తెలియజేశారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల ప్రజలకు పోడు భూముల విషయంలో అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు లంక శ్రీనివాసరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బైరెడ్డి సీతారామారావు, దర్శి సాంబశివరావు, పిలక వెంకటరమణ రెడ్డి, రామచిట్టి, హరిక్రిష్ణ, వేణు, దేవా తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: