మన్యం మనుగడ, వాజేడు మే 12:
వాజేడు మండలం పేరూరు పిహెచ్సి కేంద్రంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ నంబి కిషోర్ అధ్వర్యంలో నర్సులను ఉద్దేశించి పర్మాసిస్ట్ సతీష్ మాట్లాడారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులపై అంకిత భావంతో చేవచేసే వారిలో నర్సుల సేవలు ఎనలేనివి అని అన్నారు. అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ కి వచ్చిన రోగులకు తక్షణమే వైద్య సేవలందించి ఆరోగ్యంగా చక్కబెట్టే వారిలో నర్సుల సేవలు మరువలేనివి.
ఒక రోగికి కుల, మత ,లింగ ,నిష్పత్తి లేకుండా సమానత్వం గా వైద్య చికిత్స అందించే సామర్థ్యం ఒక్క నర్సులకు మాత్రమే ఉంటుంది.
దేవుడు ఒక జన్మఇస్తే అన్వర్య పరిస్థితులలో మరోజన్మ డాక్టర్ ఇస్తారు, కాబట్టి, ఇంత కల్మషం లేని వృత్తి లో ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేసే అదృష్టాన్ని కల్పించిన ఘనత మన నర్సులది.అని డాక్టర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పేరూరు, పి హెచ్చ్ సి , హెచ్ ఇ , అరున్ కుమర్ ,ల్యాబ్ టెక్నీషియన్, అశ్విన్,హెచ్ వి,లక్ష్మి, పీహెచ్ సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: