మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు బుధవారం నాడు పినపాక మండలం లోని తోగ్గూడెం గ్రామ పంచాయతీ లోని ఆదివాసీ గ్రామం టేకులగూడెం తోగు ప్రాంత పరిసరాలలో రెండు గుట్టల మధ్య సుమారు 100 కోట్లతో నిర్మించబోయే లొటారీ గండి ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేషన్ సర్వే రిపోర్టు తయారుచేసి ప్రభుత్వానికి ఇచ్చిన పత్రాన్ని పినపాక మండలం ప్రజా ప్రతినిధులకు, నాయకులకు రేగా కాంతారావు అందజేశారు . ఈ ప్రాజెక్టు పూర్తయితే పినపాక మండలం లోని తోగ్గూడెం, గోపాల్రావుపేట, గోవిందాపురం పరిసర ప్రాంతాలకు సంవత్సరమంతా నీటి సదుపాయం కలుగుతుంది. జనానికి, రైతాంగానికి ఉపయోగపడే ప్రాజెక్టుల నిర్మాణంలో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు కీలక పాత్ర పోషించడం అభినందనీయమని, పినపాక మండల ప్రజా ప్రతినిధులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ, ప్రాజెక్టుల నిర్మాణం ఇంత పెద్ద మొత్తంలో జరగలేదని, రేగా కాంతారావు హయాంలోనే అభివృద్ధి సాధ్యమైందని పలువురు చర్చించుకుంటున్నారు.
Post A Comment: