మన్యం మనుగడ/వాజేడు:
మండల కేంద్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ముగిశాయి. కరోనా నేపథ్యంలో గతంలో వాయిదా పడిన పరీక్షలను నేడు ప్రారంభించిన విషయం తెలిసిందే. కోవిడ్ నిబంధల ప్రకారం పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 281 మంది విద్యార్దులు,146 మంది విద్యార్థులు హాజరయ్యారు.
పరీక్షల కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. స్క్వాడ్స్ను రంగంలోకి దించనుంది. పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన తహాసిల్దార్ సర్వర్ పాషా,ఎవరైనా మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇవ్వమని చెప్పిన నేపధ్యంలో విద్యార్దులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు తరలించారు. చివరి నిమిషంలో కూడ కొందరు విద్యార్దులు పరుగులు తీసిన దృశ్యాలు కనిపించాయి. మండల కేంద్రంలో శుక్రవారం నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి.
Post A Comment: