CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ చెరువు లలో నీలి విప్లవం.మత్స్యకారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

Share it:

 



  • గడ్డంపల్లి లో చేపల చెరువును పరిశీలించిన ప్రభుత్వ విప్ రేగా కాంతరావు


మన్యం మనుగడ పినపాక :



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గడ్డంపల్లి లోని మండల ఎంపిపి గుమ్మడి గాంధీకి సంబంధించిన చేపల చెరువును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు శుక్రవారం నాడు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు చేపల పెంపకం పై దృష్టి సారించలేదని, టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే మత్స్య సంపద అధికంగా పెరుగుతుందన్నారు. ప్రభుత్వం అన్ని రంగాల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు.మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వారికి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు సీఎం కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని కూడా చేయడం జరిగిందన్నారు.రాష్ట్రంలో కుల వృత్తులను కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు, అన్ని చెరువులను అభివృద్ధి చేసి చేప పిల్లల పెంచేందుకు అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టిఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: