CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మంగపేట మండలం అన్ని కేంద్రాలలో ప్రశాంతం గా పదవతరగతి పరీక్షలు.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

తెలంగాణా లో రాష్ట్ర వ్యాప్తంగా పదవతరగతి పరీక్షలు సోమవారం నుండి మొదలు అయ్యాయి. విద్యార్థులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూసిన పరీక్షలు మే 23/05/2022 నుండి జూన్ 1 వరకు జరగుతాయి.పరీక్షలు ఉదయం 9:30 నిముషాలు నుండి 12:45 వరకు నిర్వహించడం జరుగుతుంది.

మంగపేట మండలం లో పదవతరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి మొదటి రోజు తెలుగు పరీక్ష కు మండలం వ్యాప్తంగా ఉన్న కేంద్రాల వారిగా కమలాపురం పరీక్ష కేంద్రం లో 190 విద్యార్థుల కు గాను 190 మంది హాజరు అయినారు, మంగపేట పరీక్ష కేంద్రం లో 161 మంది విద్యార్థుల కు గాను 160 మంది విద్యార్థులు హాజరైనారు, ఒక్కరు గైర్హాజరు, రాజుపేట జిల్లా పరిషత్ స్కూల్ పరీక్ష కేంద్రం లో 142 మంది విద్యార్థులకు గాను 141 మంది విద్యార్థులు హాజరైనారు, ఒక్క విద్యార్థి గైర్హాజరు. మంగపేట మండలం వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాలలో 493 విద్యార్థులకు గాను 491 విద్యార్థులు హాజరు అయినారు, ఇద్దరు విద్యార్థులు గైర్హాజరు అయినారు. ఎట్టకేలకు మొదటి రోజు పరీక్ష ప్రశాంతం గా ముగిసింది.

Share it:

TS

Post A Comment: