మన్యం మనుగడ కరకగూడెం : మండలపరిదిలోని
గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రైతు డిక్లరేషన్ పై అవగాహన కల్పిస్తూ రైతులతో,గ్రామస్తులతో కలిసి రచ్చ బండ కార్యక్రమాన్ని నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతుకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ.ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఎకరాకు 15 వేలు పెట్టుపడి సాయం.భూమి లేని రైతుకూలీలకు ఏడాదికి 12 వేల ఆర్థిక సాయం చేస్తాం.అన్ని పంటలకు గిట్టుబాటు ధరలతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.ధరణి పోర్టల్ రద్దు చేస్తాం.
రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం. ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు.తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ రైతులకు, పేద ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఊకె రామనాథం, మండల సీనియర్ నాయకులు గోగ్గలి నరసయ్య,మాజీ ఎంపిటిసి దుర్గం సంజీవ, మండల నాయకులు బైరిషేట్టి రామరావు,చేన్నూరి రవీందర్ రైతులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: