దమ్మపేట మే 12 ( మన్యం మనుగడ ) : సోయం గంగులు 71 వ వర్ధంతి సందర్భంగా ఆదివాసీ జెఎసి మండల అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ ఆధ్వర్యంలో సోయం గంగులు స్వగ్రామమైన జెమేదార్ బంజరలో తన స్తూపం వద్ద పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.అలాగే దమ్మపేట లో ఉన్న సోయం గంగులు విగ్రహం వద్ద కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్బంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ సోయం గంగులు ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ,సోయం గంగులు స్ఫూర్తితో ఉద్యమాలు ఉధృతం చేస్తామని తెలిపారు .ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకుడు కొరసావెంకటేష్ దొర,తెల్ల౦ రామారావు దొర సోయం వీరభద్రం,జారే ఆదినారాయణ,కాకా శివ శంకర్ ప్రసాద్,వాడే వీరస్వామి,సోయం రామ్మూర్తి. వెంకటేశ్వరరావు కుంజా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: