- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మర్మం చంద్రయ్య డిమాండ్..
మన్యం టివి దుమ్ముగూడెం:: దుమ్ముగూడెం మండలంలో కటాయి గూడెం గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీల ఆరు వారాల సంబంధించిన పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మర్మం చంద్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అలానే దుమ్ముగూడెం మండలంలోని చాలా గ్రామలో ఉపాధి పని డబ్బులు 10 వారాలు గడుస్తున్నా ఇంకా వేతనాలు జమ కావడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.సంబంధిత అధికారులు వెంటనే చొరవ చూపి వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలు 200 రోజులకు పెంచాలని, పని ప్రదేశంలో టెంట్లు, మెడికల్ కిట్లు , ఎండ తీవ్రత దృష్ట్యా వడదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఏర్పాటు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల సహాయ కార్యదర్శి సీతారామయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కల్లూరి లక్ష్మయ్య, కొరస నాగరాజు, శివ కుమార్, కూలీలు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: