గుండాల/ ఆళ్లపల్లిమే 1(మన్యం మనుగడ) సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆళ్ల పల్లి మండలంలో మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు మండలంలో పార్టీ ఆధ్వర్యంలో జెండా ఎగుర వేసి నివాళులు అర్పించారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రేసు ఎల్లయ్య మాట్లాడుతూ కార్మికులంతా ఎంతో గొప్పగా చేసుకోవాల్సిన పండుగ దినం మేడే అని అన్నారు. కార్మిక లోకాన్ని శ్రమ దోపిడీ నుంచి విముక్తి కలిగించిన రోజు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోమండల కార్యదర్శి కృష్ణ , సర్పంచ్ కోటేశ్వరరావు, రహీమ్, రాంబాబు, లాజర్, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: