మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాండురంగాపురం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు మహమ్మద్ బేగం తెలుగు సాహిత్యంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ను కైవసం చేసుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కవయిత్రి మహమ్మద్ చాంద్ బేగం"తేనె ఊటల తెలుగు" సంకలనంలో సున్నితములు రచించినం దుకుగాను 'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ 'సర్టిఫికెట్ అందుకున్నారు.నూతన ప్రక్రియ రూపకర్త సున్నితం సృష్టికర్త నెల్లుట్ల సునీత గారు సంపాదకీయంలో 120 మంది కవులు రచించిన 600 సున్నితాలను "తేనె ఊటల తెలుగు" పేరుతో పుస్తక ముద్రణ చేశారు ఇది నూతన పక్రియ సున్నితం కావడంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది.చాంద్ బేగం గతంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డు తో పాటు "ఇండియా బుక్ ఆఫ్ రికార్డు" కూడా అందుకున్నారు అనేక జాతీయ అవార్డులు అంతర్జాతీయ లేడీ లెజెండ్ అవార్డ్ అందుకున్నారు.
Post A Comment: