గుండాల మే 10(మన్యం మనుగడ) ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అదనపు వైద్యాధికారి సుకృత వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల ను ఆమె ఆకస్మికంగా పర్యటించి రిజిస్టర్ తో పాటు ఆస్పత్రిని పరిశీలించారు. అనంతరం ఆశా వర్కర్ల తో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా ప్రతి ఒక్కరు పనిచేయాలని ఆమె అన్నారు. వైద్య సేవలు గ్రామాల్లో అందించడంలో ఆశా వర్కర్లు ముందుండాలని ఆమె అన్నారు. అనంతరం ఆస్పత్రిలో కాన్పు అయిన మహిళకు కెసిఆర్ కిట్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపిహెచ్ఎన్ అన్నమేరీ, మెడికల్ ఆఫీసర్ రవిచంద్, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు
Post A Comment: