దమ్మపేట మే 22 ( మన్యం మనుగడ ) : దమ్మపేట మండల రైతు సోదరులు
మన మండలంలో గల దమ్మపేట విశాల సహకార పరపతి సంఘము లో పచ్చిరొట్ట విత్తనములు వచ్చియున్నవి.
వాటిని ది 24.05.2022 న అనగా మంగళవారము ఉదయం గం.10.30 ని.లకు అశ్వారావుపేట నియోజకవర్గ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు చే పచ్చిరొట్ట విత్తనములు పంపిణీ మరియు సొసైటీ నందు నూతన భవన నిర్మాణ శంకు స్థాపన కార్యక్రమం జరుగును.
కావున పచ్చిరొట్ట విత్తనములు కావాల్సిన రైతులు సద్వినియోగం చేసుకోని, శంకు స్థాపన కార్యక్రమం లో పాల్గొనాలని సహకార సంఘం అధ్యక్షుడు రావు జోగేశ్వర రావు తెలిపారు
.విత్తనం ధరలు జీలుగులు 30కేజీల బ్యాగ్ 670/-
జనుములు 40 కేజిల బ్యాగ్ 1170/-
పిల్లి పెసర 20కేజీ ల బ్యాగ్ 620/- అని తెలియపరిచారు.కావలసిన రైతులకు పట్టా పాసుపుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ సమర్పించగలరు.
Post A Comment: