మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం దోమెడ గ్రామానికి చెందిన మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు కొమరం వెంకన్న అనారోగ్యంతో శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందగా విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ వారి స్వగ్రామం దోమెడ లో వెంకన్న పార్ధివదేహానికి నివాలర్పించి ,కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్బంగా కుడుముల లక్ష్మి నారాయణ మాట్లాడుతూ కొమరం వెంకన్న పార్టీకి చేసిన సేవలు మరువలేమని, వెంకన్న మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ వెంకన్న కుటుంబానికి తెరాస పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, ఎండీ గౌస్ పాషా,దోమెడ గ్రామ కమిటీ అధ్యక్షులు లక్ష్మయ్య, నిమ్మగూడెం గ్రామ కమిటి అధ్యక్షులు ఉసం శ్రీను ,మండల సోషల్ మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి,పుల్లారావు,మద్దెల రాంబాబు,ఆశ్రఫ్,బొడ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: