ములకలపల్లి:మే 20:మన్యం మనుగడ ప్రతినిధి :
మండలం లోని జగన్నాధపురం మెయిన్ సెంటర్ లో ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి మనవడు నందమూరి తారకరామారావు (జూనియర్ ఎన్ టి ఆర్) జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు.ప్రధన కూడలిలో బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచారు అనంతరం, కేక్ కత్తిరించి అభిమానులు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, ఐ టిడిపి అశ్వారావుపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షేక్ కరీం,కంటే నాగ శేషు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఇటువంటి పుట్టిన రోజులు మరి ఎన్నో జరుపుకోవాలని,నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో అభిమానులు కంటే రామకృష్ణ, గిరి, షేక్ జానీ, అప్పాజీ ,సత్య, శేఖర్, శివ, కంటే కిరణ్, చెన్న, వినయ్, సాయి నందు, కిరణ్, పండు, సాయిరాం, సత్య భాస్కర్ స్వామి, కేసు, చిన్ను యువ తేజ్, మనీ, పండు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: