మన్యం మనుగడ/ వాజేడు:
వాజేడు మండలం లో ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే ను మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాలలో మేడే ఉత్సవాలు జరుపుకున్నారు, ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దబ్బకట్ల లక్ష్మయ్య మాట్లాడుతూ కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో లక్షలాది మంది కార్మికులు ప్రాణాల త్యాగాల నుండి పుట్టింది ఎర్ర జెండా,ఈ పోరాటం వలన పెట్టుబడిదారులు కార్మికులకు మధ్య జరిగిన ఒప్పందంలో 12 గంటల నుండి 8 గంటల వరకు పని గంటలకు కుదింపు జరిగింది ,ఇట్టి పోరాటాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే దాంట్లో విఫలం అవుతున్నాయి, కార్మికుల శ్రమ దోపిడీ వ్యతిరేకంగా మేడే స్ఫూర్తిని తీసుకొని రాబోయే తరాలలో కార్మిక వర్గ పోరాటాల ద్వారా విజయం సాధించాలని కార్మికులకు కర్షకులకు పిలుపునివ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొప్పుల రఘుపతి,నాయకులు దామోదర్,కృష్ణ బాబు, రమాదేవి, సౌమ్య ,సిఐటియు మండల అధ్యక్షురాలు శాంతకుమారి ,దేవి, పిట్టల లక్ష్మి ,శకుంతల, రామక్క, సందీప్ ,ప్రభాకర్ సీత తదితరులు పాల్గొన్నారు,
Post A Comment: