మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింత్రియాల గ్రామంలో గోదావరి నది ఒడ్డు పై ఉన్న, దక్షిణ కాశీగా నామ కారణమైన అతి పురాతనమైన దేవాలయం ఆలయ ప్రత్యేకత ఏక పాన మట్టమ్ పై శివుడు,ఆంజనేయ స్వామి, కలిసి ఉన్నా భూ మండలంలో ఏకైక దేవాలయం బుధవారం హనుమాన్ జయంతి సందర్భంగా ఆకు పూజ, కోటి హనుమాన్ చాలీసా సంపూర్ణమైన సందర్భంగా మహా యాగము, పూజా కార్యక్రమాలు, సీతారామచంద్ర స్వామి కళ్యాణము,ను ఘనంగా నిర్వహించారు.మహా అన్న ప్రసాద కార్యక్రమములు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అశ్వాపురం తాసిల్దార్ సురేష్ కుమార్, ఎంపీపీ ముత్తినేని సుజాత, ఎంపీటీసీ ఎనిక రవి, టిఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు కందుల కృష్ణార్జున రావు, ఎస్ కే టీ గ్రూప్ అధినేత పిచ్చేశ్వరరావు, ఎండి షరీఫుద్దీన్, యంకటి పుల్లారెడ్డి , పున్నారెడ్డి, పోతురాజు శ్రీనివాస్, కాజా శ్రీను , సంధ్య,అమ్మ నాగ నారాయణీ భక్తులు, ఆలయ కమిటీ వారు, మండల సిబ్బంది, గ్రామ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: