మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం మల్లూరు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు మొక్కుబడులు 2022 మార్చి 28 నుండి 2022 మే 25 జాతర వరకు కలిపి గురువారం పరకాల దేవాదాయ శాఖ డి ఆముల్ కుమార్ పరిశీలకుల పర్యవేక్షణలో హుండిలను లెక్కించారు.హుండిల ద్వార 9,57,800₹అక్షరాలా తొమ్మిది లక్షల, యాభై ఏడువేల, ఎనిమిది వందల రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈఓ సత్యనారాయణ తెలిపారు.ఈ కార్యక్రమంలో మంగపేట ఏఎస్ఐ లక్ష్మయ్య,ఆలయ కమిటీ చైర్మన్ ముకుందాం,సభ్యులు శ్రీనివాస్ రావు,రామకృష్ణ, నరసింహరావు, ఆలయ అర్చకులు రాఘవ చార్యులు,రాజశేఖర్ శర్మ,పవన్ కుమార్ చార్యులు,రాములు, సుధీర్ కుమార్,ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: