CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

"మన ఊరు మన బడి" ప్రాజెక్ట్ నిధుల సద్వినియోగం బాధ్యత విద్యా కమిటీ లదే ఆర్డిఓ స్వర్ణలత..

Share it:


మన్యం మనుగడ : జూలూరుపాడు, మే 11 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో "మన ఊరు మన బడి" ప్రాజెక్ట్ కి ఎంపికైన 17 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ లు, ఏ ఈ లతో జూలూరుపాడు మండల ప్రత్యేక అధికారి కొత్తగూడెం ఆర్డిఓ స్వర్ణలత బుధవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో స్వర్ణలత మాట్లాడుతూ.. "మన ఊరు మన బడి" ప్రాజెక్టు ద్వారా విడుదల కానున్న నిధులను ఆయా పాఠశాలల విద్యా కమిటీ చైర్మన్ లు తమ పాఠశాలల అభివృద్ధికి ఉపయోగపడేలాగా ప్రతి పైసా సద్వినియోగం అయ్యేవిధంగా చూడవలసిన బాధ్యత ఎస్ఎంసి కమిటీ చైర్మన్ లేదని అన్నారు. అనంతరం మండలంలోని కాకర్ల ఎంపీపీఎస్ పాఠశాల పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: