మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెమడుగు హైస్కూల్లో పదవ తరగతి ఎగ్జామ్ సెంటర్ ఉండడంతో విద్యార్థులు మల్లెల మడుగు హై స్కూల్ నుండి మొండికుంట కు ఒక కిలోమీటరు ఎండలో నడిచి వస్తుండటంతో వారి ఇబ్బందులను గమనించిన అశ్వాపురం రెవెన్యూ ఆఫీసర్ సురేష్ కుమార్ విద్యార్థులకు బస్ సౌకర్యం కల్పించారు.బస్సు సౌకర్యం కల్పించిన ఎమ్మార్వో సురేష్ కుమార్ కు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Post A Comment: