CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు..... ఎంపీడీవో అన్నపూర్ణ..

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: పదో తరగతి పరీక్ష కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో అన్నపూర్ణ తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రంలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ తోట తులసిరాం, జిపీ సెక్రటరీ ఉపేందర్, ఉపాధ్యాయులు నరసింహారావు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: